రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీకి సంబంధించి కొత్త గందరగోళం ఏర్పడింది. బుధవారం పాఠశాలలు పున: ప్రారంభం కావడంతో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో పుస్తకాల ముందుమాట మార్చకుండానే ముద్రించినట్లు ప్రభుత్వం గమనించింది. ఈ వివాదం కారణంగా పుస్తకాల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసి, ఇప్పటికే పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.