Sunday, July 13, 2025
Homenewsబీజేపీకి దూరంగా, కాంగ్రెస్ వైపు జగన్?

బీజేపీకి దూరంగా, కాంగ్రెస్ వైపు జగన్?

కాంగ్రెస్ హైకమాండ్ నుండి జగన్ మోహన్ రెడ్డికి పిలుపు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ చేతులు కలపడంతో జగన్ ఒంటరిగా మారారని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ భావించినట్టు సమాచారం. సోనియా గాంధీ, జగన్‌ను తమ ఇండియా కూటమిలో చేర్చుకోవాలని యత్నిస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే, జగన్ కేంద్రంలో కీలక నేతగా మారతారు. ఇదివరకు బీజేపీకి సపోర్ట్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికల బరిలో ఉంది. ఇందులో, కాంగ్రెస్ హైకమాండ్ తమ ఇండియా కూటమిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చేర్చుకోవాలనే వ్యూహాలు రాస్తోంది. మరి జగన్, సోనియా గాంధీ పిలుపును ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలి.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS