Monday, September 16, 2024
Homeతెలుగుతెలంగాణదళిత ఎస్.ఐ మృతికి కారణమైన సి.ఐ ని వెంటనే విధులనుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలి

దళిత ఎస్.ఐ మృతికి కారణమైన సి.ఐ ని వెంటనే విధులనుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలి

 

బెజ్జంకి మండలం :అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు కొత్త రాజ్ కుమార్  ఆధ్వర్యంలో అశ్వరావుపేట ఎస్.ఐ శ్రీరాముల శ్రీనివాస్ మృతికి సంతాపంగా కొవ్వత్తులతో నివాళి .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్.ఐ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ను మానసికంగా ఇబ్బంది పెట్టిన సి.ఐ జితేందర్ రెడ్డిని నలుగురు కానిస్టేబుల్స్ వీరిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చెయ్యడం జరిగింది, ఒక దళిత కుటుంబానికి చెందిన ఎస్. ఐ శ్రీనివాసులు సి.ఐ అనేక రకాలుగా మానసిక ఇబ్బంది పెట్టడం వల్ల తాను బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు, చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారు ఆయన మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము,దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా దళిత బహుజన పట్ల జరుగుతున్న దాడులను అరికట్టడంలో పాలకులు విఫలం అవుతున్నారు, ఇప్పటికైనా స్పందించి దళిత బహుజానులపై జరుగుతున్న దాడులను అరికట్టే పటిష్టమైన చట్టాలను అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి బోనగిరి రూపేష్, లింగాల శ్రీనివాస్, బొర్ర సురేష్,మిద్దె రవి,బోనగిరి శేషు,ఉప్పులేటి బాబు,రామంచ సంజీవ్, సంగెం రూపేష్ లింగంపల్లి అనిల్, అంబేద్కర్ సంఘం నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS