Thursday, March 26, 2026
Homenewsపులివెందుల హౌసింగ్ లేఅవుట్ లో అక్రమాలు

పులివెందుల హౌసింగ్ లేఅవుట్ లో అక్రమాలు

పులివెందుల మున్సిపాలిటీ హౌసింగ్ లేఅవుట్ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 8400 ఇళ్లను మంజూరు చేసినందున, అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని భూమిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. అలాగే, సంబంధిత నకిలీ లబ్ధిదారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS