హైదరాబాదీలు ఆర్థిక క్రమశిక్షణలో తమకు మించిన వారు లేరని నిరూపించారు. ‘ది గ్రేట్ ఇండియన్ వాలెట్’ నిర్వహించిన అధ్యయనంలో, హైదరాబాదీ నగరవాసులు దేశవ్యాప్తంగా పొదుపులో నంబర్ 1గా ఉన్నారు. సగటు వ్యక్తిగత ఆదాయంలో హైదరాబాదీలు 17 నగరాల కంటే ముందున్నారు. మధ్యతరగతి వర్గాలు సౌకర్యంగా జీవించడానికి, ఆదాయం పొందేందుకు భాగ్యనగరం సరైన ప్రదేశమని అధ్యయనం పేర్కొంది. 18 నుంచి 55 ఏళ్ల వయసు కలిగి, వార్షిక ఆదాయం 3.5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారిని సర్వేలో పరిగణించారు. హైదరాబాద్, మధ్యతరగతి ప్రజలకు అనుకూల నగరంగా వరుసగా రెండోసారి ద్వితీయస్థానంలో నిలిచింది. బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. అధిక ఆదాయాన్ని పొదుపు చేసే వారిలో 69 శాతం మంది హైదరాబాదీలు. నెలవారీ ఖర్చుల్లో, 35% పర్యటనలు, 19% బయటి ఆహారం, 6% ఫిట్నెస్, 10% ఓటీటీ యాప్లకు వెచ్చిస్తున్నారు. 57% మంది దుస్తులు, ఇతర అవసరాలు మాత్రమే కొనుగోలు చేశారు. 88% సేవింగ్స్ నగదు రూపంలో భద్రపరిచారు. హైదరాబాదీలు ఆర్థిక క్రమశిక్షణలో అగ్రగామిగా నిలుస్తూ, దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు.