Thursday, October 17, 2024
HomeతెలుగురాజకీయంVijayasai Reddy: టీడీపీపై బీజేపీకి పెద్ద ఆశలేం లేవు: విజయసాయి

Vijayasai Reddy: టీడీపీపై బీజేపీకి పెద్ద ఆశలేం లేవు: విజయసాయి

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఏమేరకు ప్రభావం చూపుతుందనే విషయంలో బీజేపీ పెద్దలకు క్లారిటీ ఉందని విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) పేర్కొన్నారు. టీడీపీ మీద బీజేపీ నేతలు ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని చెప్పారు.

కనీసం ఒక్క స్థానంలోనైనా టీడీపీ జెండా ఎగురుతుందని చెప్పినా బీజేపీ నమ్మదని, టీడీపీ శక్తిసామర్థ్యాలు ఏ పాటివనే విషయం బీజేపీకి తెలుసని విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తను సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

అదేవిధంగా ఎన్డీయే కూటమి 400 చోట్ల విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుందన్నారు. ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ, ఎన్సీపీ, జేడీయూ, ఆర్ఎల్డీ, ఎల్జేపీతో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు 30 లోక్‌సభ సీట్లు వస్తాయని కేంద్రంలోని బీజేపీ పెద్దల అభిప్రాయం. అయితే, ఇందులో టీడీపీ, జనసేనల వాటా సున్నా అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

READ LATEST TELUGU NEWS: కాపులంతా ప్రజాశాంతి పార్టీలో చేరండి : కేఏ పాల్

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS