Nita Ambani Uses World’s Most Expensive Water Bottle Worth Rs. 49 Lakhs :ఇండియాలోనే అత్యంత ధనిక కుటుంబం అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఇప్పుడు హాట్ టాపిక్. అంబానీ దంపతుల చిన్న వారసుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటలీలోని ఓ క్రూజ్ షిప్లో జరగుతోంది. ఈ వేడుకలలో నీతా అంబానీ వాడే వాటర్ బాటిల్ పై ఆసక్తికరమైన వివరాలు బయటపడ్డాయి.
నీతా అంబానీ వాడే వాటర్ బాటిల్ ధర అక్షరాలా రూ. 49 లక్షలు! అంతేకాకుండా, ఆమె తాగే నీళ్లు సాధారణ మినరల్ వాటర్ కాదు. ‘ఆక్వా డి క్రిస్టిల్లో ట్రిబ్యుటో మోడీగ్లియానీ’ అనే బ్రాండ్కి చెందిన ఈ నీళ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి.
ఈ గోల్డెన్ వాటర్ ఫిజి, ఫ్రాన్స్ దేశాల నుంచి వసంత రుతువు సమయంలో వసంతంతో నేచురల్గా తయారుచేయబడింది. ఈ నీటిలో గోల్డ్ పార్టికల్స్ ఉంటాయట, ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయట. అలాగే, ఈ బాటిల్ సగం బంగారంతోనే డిజైన్ చేయబడింది.