వేణుస్వామి సెలబ్రిటీల జాతకం చెప్తూ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సమంత-నాగచైతన్య విడిపోతారు అని చెప్పి సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత నిజమవడంతో వైరల్ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పి, కూటమి గెలవడంతో ఇక జాతకాలు చెప్పనని ప్రకటించారు. తాజాగా వేణుస్వామి బార్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీకెండ్ లో మందు కొట్టేందుకు తన మిత్రుడితో బార్కి వెళ్లిన వేణుస్వామి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈయన గతంలో తనకు మందు అలవాటు ఉందని చెప్పిన విషయం తెలిసిందే. మరి వేణుస్వామి ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

