కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. పెన్షన్ల పంపిణీ సమయంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కార్పొరేటర్కు సమాచారం ఇవ్వకుండా తానే పంపిణీ చేయడం గౌరవం కాదని కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎమ్మెల్యే మాధవి రెడ్డి, “పెన్షన్ల పంపిణీ సమయంలో నేను ఏ అధికారులకు చెప్పాలో వారికి చెప్పి పంపిణీ చేయించాను. దీనికి కార్పొరేటర్కు చెప్పాల్సిన అవసరం లేదు. కార్పొరేటర్ అంటే జిల్లాను సొంతం చేసుకున్నవాళ్లు కాదు. ఇది మనం కొనుక్కున్న ప్రాంతం కాదు. ప్రతీ చిన్న విషయానికి బొట్టు పెట్టి పిలుస్తారా? ఇది మా ఇంట్లో పేరంటం కాదు మీ ఇంట్లో పేరంటం కాదు. మీరు పబ్లిక్ మీటింగ్లో ఇలాంటి అడగకండి. వీటికి ప్రోటోకాల్ లేదు. మీరు స్వచ్ఛందంగా పాల్గొనండి, ఎవ్వరూ పిలవరు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పొరేటర్ కూడా సమాధానం ఇచ్చారు. “మేడం, జిల్లాలో పోలియో చుక్కల పంపిణీకి కూడా కార్పొరేటర్కు సమాచారం ఇస్తారు. మీరు మాత్రం మాకు ఏమీ చెప్పకుండా చేస్తున్నారు,” అని కార్పొరేటర్ అన్నారు. ఈ వివాదం కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో చోటుచేసుకుంది, అక్కడ ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగింది.