Thursday, August 20, 2026
Homenewsహెరిటేజ్‌ షేర్ల విలువ రెట్టింపు

హెరిటేజ్‌ షేర్ల విలువ రెట్టింపు

తెలుగు దేశం పార్టీ అధినేత, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కేవలం ఐదు రోజుల్లో రూ.579 కోట్లు సంపాదించారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్స్ ఈ వారం రోజుల్లో విపరీతంగా లాభాలను చూశాయి. ఈ స్టాక్‌లో భువనేశ్వరికి 24.37% వాటా ఉంది. మే నెలలో హెరిటేజ్ ఫుడ్స్‌కి చెందిన ఒక్కో షేర్ ధర రూ.402.90గా ఉండగా, చంద్రబాబు నాయుడు గెలవడంతో ఆ ధర రూ.659కి పెరిగింది. నారా భువనేశ్వరి 2,26,11,525 షేర్లు కొనుగోలు చేయడం వల్ల ఈ లాభాలు పొందారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS