Tuesday, January 13, 2026
Homenewsసుశాంత్ ఇంటికి కొత్త యజమాని అదా శర్మ

సుశాంత్ ఇంటికి కొత్త యజమాని అదా శర్మ

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివాసంలోకి నటి అదా శర్మ ప్రవేశించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ముంబై బాంద్రాలో ఉన్న సుశాంత్ నివాసాన్ని అమ్మకానికి పెట్టారు. అయితే, సుశాంత్ ఆత్మహత్య చేసిన కారణంగా చాలా మంది ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి భయపడ్డారు. కానీ అదా శర్మ మాత్రమే ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. సుశాంత్ చనిపోయిన తర్వాత ఆ ఇంటికి కొనుగోలు దారులు దొరక్కపోవడంతో ధర తగ్గించారు. తక్కువ ధరకు అందుతున్నదనే కారణంతో అదా శర్మ ఆ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. నిన్ననే ఆమె ఆ ఇంట్లోకి మారారు. ఆ ఇంట్లోకి వెళ్లగానే పాజిటివ్ వైబ్స్ వచ్చాయ‌ని అన్నారు. 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 14న ఆయన చనిపోయి నాలుగేళ్లు అవుతోంది. ఇప్పటికీ సుశాంత్ మరణంపై పోలీసులు కానీ సీబీఐ కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, న్యాయం చేయలేదని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS