ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని కూడా అంటారు. అయితే ప్రస్తుత కాలంలో మారినజీవనశైలి, ఆహారపు అలవాట్లు ప్రతిఒక్కరినీ అనారోగ్యం బారిన పడేలా చేస్తున్నాయి. 60 ఏళ్లు దాటాక రావాల్సిన వ్యాధులు 30 ఏళ్లకే వస్తున్నాయి. తెలంగాణలో 30 ఏళ్లు దాటిన వారు బీపీ, షుగర్(BP And Sugar Levels) ముప్పును ఎదుర్కొంటున్నారని వైద్యారోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. రాష్ట్రంలో 30 ఏళ్లు దాటిన వారికి వైద్యశాఖ నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (NCD) (అంటు వ్యాధులు కాని రోగాలు)ను స్క్రీనింగ్ చేస్తోంది.
అయితే ఈ నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ పరీక్షల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. జనవరి లెక్కల ప్రకారం తెలంగాణ యువతలో 12.4 శాతం మంది రక్తపోటు, 6.6 శాతం మంది షుగర్తో బాధపడుతున్నట్లు తేలింది. రాష్ట్రంలో 30 ఏళ్లుదాటిన వారు 1.82 కోట్ల మంది ఉండగా.. వారందరికీ ఎన్సీడీ స్క్రీనింగ్ చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకోసం ఇంటింటి తిరిగి సర్వే చేస్తోంది. అందులో భాగంగా జనవరి చివరి నాటికి 1.51 కోట్ల మందికి పరీక్షలు చేసింది. అందులో 19.21 లక్షల మందికి బీపీ ఉన్నట్లు తేలింది. 9.98 లక్షల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. మెుత్తం యువతలో 19 శాతం మంది ఆ రెండింటి(BP And Sugar Levels) బారిన పడినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. రాష్ట్రంలో బీపీ, షుగర్ బాధితులు అత్యధికంగా మెదక్ జిల్లాలో ఉన్నారు. ఈ జిల్లాలో 30 ఏళ్లు దాటిన వారిలో 3,57,153 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 83,581 మందికి బీపీ, 51,247 మందికి షుగర్ ఉన్నట్లు వెల్లడైంది. అంటే పరీక్షలు చేయించుకున్న వారిలో 23 శాతం మంది రక్తపోటు, 14 శాతం మంది షుగర్తో బాధపడుతున్నట్లు పరీక్షల్లో బయటపడింది.
ఇక రెండో స్థానంలో వరంగల్ జిల్లా నిలిచింది. ఆ జిల్లాలో 4,31,949 మందికి పరీక్షలు నిర్వహించగా.. 68,657 మందికి బీపీ, 34,716 మందికి షుగర్ ఉన్నట్లు బయటపడింది. అంటే 16 శాతం మంది బీపీ, 8 శాతం మంది షుగర్(BP And Sugar Levels) వ్యాధిగ్రస్తులున్నట్లు వెల్లడైంది.
బీపీ, షుగర్ వ్యాధులకు కారణాలివే..
తీవ్రమైన ఒత్తిడిలో పని చేయడం, సమయానికి తినకపోవటం, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం లాంటివి బీపీ, షుగర్లకు ప్రధాన కారణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. బీపీ, షుగర్ మాత్రమే కాకుండా. గుండె, మూత్ర పిండాల జబ్బులు, కేన్సర్ కేసులు కూడా తెలంగాణలో బాగా పెరుగుతున్నాయని అంటున్నారు. చాలా మంది 30లోపే వీటి(BP And Sugar Levels) బారిన పడుతున్నట్లు డాక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
తెలంగాణలో మద్యం, సిగరెట్లు, ఇటీవల డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య కూడా బాగా పెరిగిందని… అది కూడా ఎన్సీడీల తీవ్రత పెరగడానికి కారణమవుతోందన్నారు. గత పదేళ్లతో పోల్చితే ఈ వ్యాధులబారిన పడేవారి సంఖ్య ఎక్కువవైందని చెప్పారు.
సరైన జీవనశైలి లేకపోవడం వల్ల బీపీ, షుగర్(BP And Sugar Levels)తో పాటు గుండెపోటు, బ్రెయిన్స్ట్రోక్, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం, ఊబకాయం రోగులు క్రమంగా పెరుగుతున్నారన్నారు. సాధ్యమైనంత వరకు జీవన శైలిని మార్పులు చేసుకొని శరీరానికి తగినంత వ్యాయామం, సమయానికి భోజనం, కంటినిండా నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
READ LATEST TELUGU NEWS : కడుపు నిండా తినగానే కునుకేస్తున్నారా.. ఇది తెలిస్తే ఆపేస్తారు!