కదనభేరీ(Kadanabheri) పేరుతో బీఆర్ఎస్ పార్టీ నేడు కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సభలో పాల్గొననున్నారు. ఈ సభ ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శంఖారావం పూరించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం గత నెలలో నల్గొండలో కృష్ణా జలాలపై తొలి సభ నిర్వహించారు. ఇప్పుడు కరీంనగర్లో రెండో సభ నిర్వహిస్తున్నారు. కరీంనగర్ (Kadanabheri)సభను బీఆర్ఎస్ సెంటిమెంట్గా భావిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేస్తోంది. ఇక కరీంనగర్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే బోయినపల్లి వినోద్ కుమార్ పేరును పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.
నేడే "కరీంనగర్ కదనభేరి"
లక్షలాదిగా తరలివెళదాం.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను అఖండ మెజార్టీతో గెలిపిద్దాం.#VoteForCar pic.twitter.com/xdblRJyJ0i
— BRS Party (@BRSparty) March 12, 2024
READ LATEST TELUGU NEWS: కరీంనగర్ ఎంపీగా నేనే గెలుస్తా: బోయినపల్లి వినోద్ కుమార్