కొంతకాలంగా క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఏమైనా కాస్త ఎక్కువ విలువైన వస్తువుల కొనుగోలు కోసమైనా.. అత్యవసరంగా డబ్బులు కావాలన్నా.. ఇలాంటి వాటి కోసం క్రెడిట్ కార్డుల్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని బట్టి కొత్త రూల్స్(CREDIT CARD NEW RULES) తీసుకువస్తున్నాయి.
ప్రస్తుత రోజుల్లో దాదాపు బ్యాంక్ అకౌంట్ ఉన్న చాలా మంది క్రెడిట్ కార్డుల్ని తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డుల్లో వాడకాన్ని బట్టి రివార్డు పాయింట్లు ఆఫర్ చేస్తుంటాయి. ఇంకా ఒక్కో క్రెడిట్ కార్డు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఇస్తుంటాయి.
అలాంటి బెనిఫిట్స్ రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్స్, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఇలా చాలానే ఉంటాయని చెప్పొచ్చు. ఇటీవల చాలా క్రెడిట్ కార్డు జారీ సంస్థలు.. తమ క్రెడిట్ కార్డులకు సంబంధించి ఎన్నో మార్పులు(CREDIT CARD NEW RULES) తీసుకొచ్చాయి. వీటి గురించి చూద్దాం. ఎస్బీఐ కార్డ్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్ వంటివి ఈ లిస్టులో ఉండగా.. వీటిల్లో మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్బీఐ కార్డ్ క్రెడిట్ కార్డులకు సంబంధించి కీలక మార్పు జరిగింది. కొన్ని ఎంపిక చేసిన ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో చేసే రెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ల ద్వారా వచ్చే రివార్డ్ పాయింట్ల సేకరణ ఇకపై ఉండదని స్పష్టం చేసింది.
ఇది 2024, ఏప్రిల్ 1 నుంచి అమలవుతుందని ఎస్బీఐ వెల్లడించింది. వీటిల్లో ఎస్బీఐకి చెందిన ఎన్నో పాపులర్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఆరూమ్, ఎస్బీఐ కార్డ్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్, ఎస్బీఐ కార్డ్ పల్స్, సింప్లీక్లిక్ ఎస్బీఐ కార్డ్ వంటివి ఈ లిస్టులో ఉన్నాయి. ఇంకొన్ని క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్ల సేకరణ ఏప్రిల్ 15 నుంచి నిలిచిపోతుందని పేర్కొంది.
యస్ బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్(CREDIT CARD NEW RULES) తెచ్చింది. ఒక క్యాలెండర్ క్వార్టర్లో (3 నెలల కాలంలో) రూ. 10 వేలు అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసిన వారికే కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ వస్తుంది.
అంటే ఈ క్వార్టర్లో చేసిన ఖర్చుల్ని బట్టి.. వచ్చే త్రైమాసికం లాంజ్ యాక్సెస్కు అనుమతి ఉంటుందన్నమాట. ఇలానే ఐసీఐసీఐ బ్యాంక్ లాంజ్ యాక్సెస్కు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులో కూడా ఒక క్యాలెండర్ క్వార్టర్లో రూ.35 వేలు ఖర్చు చేస్తే కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ప్రయోజనాలు పొందొచ్చు. ముందటి క్వార్టర్లో స్పెండింగ్స్ను బట్టి.. నెక్ట్స్ క్వార్టర్లో ఆ బెనిఫిట్ పొందే అవకాశముంటుంది.
యాక్సిస్ బ్యాంకు కూడా ఎడ్జ్ రివార్డ్ పాయింట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఫ్యూయెల్, ఇన్సూరెన్స్, గోల్డ్/జువెలరీ వంటి వాటి కొనుగోళ్లపై రివార్డ్ పాయింట్లు వర్తించగా.. ఇప్పుడు వాటిని ఉపసంహరించుకుంది.
యాన్యువల్ ఫీ వేవర్ విషయంలోనూ వీటిని యాక్సిస్ బ్యాంకు ఎత్తేసింది. మాగ్నస్ క్రెడిట్ కార్డులకు సంబంధించి లాంజ్ యాక్సెస్లో పలు మార్పులు చేసింది. ఇకపై క్యాలెండర్ ఇయర్లో 4 సార్లు లాంజ్ యాక్సెస్ పొందొచ్చని పేర్కొంది.
READ LATEST TELUGU NEWS: రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్.. 10 నిమిషాల్లో రావాల్సిందే లేకుంటే అంతే!