రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఇటీవల కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. మద్యం ప్రియుల నుంచి వస్తున్న వ్యతిరేకత, కొత్త కంపెనీల ఉత్పత్తుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కొత్త బీర్ బ్రాండ్లపై నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కొత్తకొత్త మీమ్స్ తో నిరసనను తెలియజేశారు. దీంతో కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారం తలనొప్పిగా మారడంతో, కొత్త కంపెనీలకు ఇవ్వాల్సిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది.