సైదాబాద్ సింగరేణి కాలనీలోని మోహన్ బాబు (25) అనే యువకుడు మద్యం మత్తులో శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హంగామా సృష్టించాడు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మోహన్ బాబు స్తంభం మీద కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ అందరినీ భయపెట్టాడు. గంటన్నర పాటు పోలీసులకు ముప్పు చూపించాడు. చివరకు పోలీసులు స్తంభం ఎక్కి మోహన్ బాబును కిందకు దించారు. గత రెండేళ్లలో ఐదుసార్లు ఇలా స్తంభం ఎక్కాడని, భార్య తిట్టినా, కోపం వచ్చినా ఇలాంటి పనులు చేస్తాడని తెలిపారు.