Monday, November 10, 2025
Homenewsప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా పేరుగాంచిన చినాబ్ బ్రిడ్జి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. జమ్మూ కశ్మీర్ లోని రాంబన్ జిల్లా సాంగల్దాన్ నుంచి రియాసీ జిల్లాను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనపై రైలును ప్రయోగాత్మకంగా నడిపారు. ఈ ట్రయల్ విజయవంతమైందని, త్వరలో రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని ఉత్తర రైల్వే విభాగం పేర్కొంది. 359 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ వంతెన, చైనాలోని షుబాయ్ రైల్వే వంతెన (275 మీటర్లు) కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. ప్రపంచప్రఖ్యాత ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్లు ఎక్కువ ఎత్తు గల ఈ వంతెన, కశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు ఉపయోగకరంగా మారనుంది.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS