వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఆర్కే రోజాకు సీఐడి నుంచి పిలుపు రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా రోజా రూ. 100 కోట్లు దోచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వినియోగించలేదని, సీఐడీ కేసు నమోదు చేయడంతో, స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యాలయంపై రైడ్లు జరిపి పత్రాలు స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నారు. అతి త్వరలో సీఐడి నుంచి మొదటి నోటీసు రోజాకు వెళ్లనుందని తెలుస్తోంది.

