BCCI meeting with IPL franchises: ఏప్రిల్ 16న ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లతో బీసీసీఐ పెద్దలు సమావేశం కానున్నారు. ఇప్పటికే మొత్తం 10 మంది ఐపీఎల్ టీమ్ ఓనర్లకు బోర్డు ఆహ్వానాలు పంపింది.
ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి మెగా వేలం, ఆటగాళ్ల రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ కార్డ్, పర్స్ వ్యాల్యూ తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు రావచ్చని తెలుస్తోంది.
Read Also: కెప్టెన్సీ నుంచి ధోనీ అందుకే తప్పుకున్నాడు
అహ్మదాబాద్లో జరిగే ఈ సమావేశాని(BCCI meeting with IPL franchises)కి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ హాజరుకానున్నారు.
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ కు సంబంధించి మెగా వేలం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరగవచ్చని భావిస్తున్నారు.
అంతకుముందు జరిగే ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ నియమ నిబంధనల గురించి ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది.
READ LATEST TELUGU NEWS: స్వామికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు