Tuesday, April 22, 2025
Homenewsగాంధీభవన్ లో ప్రారంభమైన కాంగ్రెస్ PAC సమావేశం

గాంధీభవన్ లో ప్రారంభమైన కాంగ్రెస్ PAC సమావేశం

BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్

హైదరాబాద్, (వర్డ్ ఆఫ్ ఇండియా)

హైదరాబాదులోని గాంధీభవన్ లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ యొక్క భేటీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ భేటీకి చైర్మన్ గా మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షత వహిస్తుండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల  నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇతర మంత్రులు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలి, మిగిలిన గ్యారంటీల  అమలు, పార్టీ యొక్క జిల్లా  మరియు నియోజకవర్గ కార్యాలయాల నిర్మాణాలు ఇంకా ఇతర  కీలక అంశాలపై సమావేశం జరుగుతుంది.

ఈ  సమావేశంలో సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు, జగ్గారెడ్డి, గీతా రెడ్డి పలువురు నాయకులు  పాల్గొన్నారు

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS